భవానీ ద్వీపం

భవానీ ద్వీపం

కృష్ణా నదిలో సహజసిద్ధంగా ఏర్పడిన ప్రాంతమే ఈ భవానీ ద్వీపం. ఈ ద్వీపం కృష్ణానదిపై ఉన్న అన్ని ద్వీపాలలోకి పెద్దదని చెప్పాలి. ఇది విజయవాడ నగరానికి 4కి.మీ.ల దూరంలో ఉంటుంది. 133 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది. ఈ దీవిని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ గొప్ప పర్యాటక ప్రదేశంగా మలిచింది. కృష్ణా నది మధ్యలో ప్రశాంత వాతావరణంలో ఈ ద్వీపం ఉండటంతో నగర ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు.

ఇక్కడ ఓ రిసార్టు కూడా ఉంది. ప్రకృతి ప్రేమికులకు ఇది చక్కటి విహార క్షేత్రం.ఇక్కడ బోటింగ్ సౌకర్యం కూడా ఉంది. ఈ ద్వీపంలో రాత్రి బస చేసేందుకు వీలుగా ట్రీ టాప్ కాటేజీలు కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి భయం లేకుండా ఉండేందుకు భద్రతా సిబ్బందిని నియమించారు. ద్వీపంలో పిల్లలు..పెద్దలు ఎంజాయ్ చేసేందుకు అనువైన వాతావరణం ఉంటుంది.

Similar Posts

Recent Posts

International

Share it